- దాన్ని వాపస్ తీస్కోం
న్యూఢిల్లీ: సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ) రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. దేశానికి సంబంధించిన ఈ చట్టాన్ని కేరళ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు అడ్డుకోలేవని స్పష్టం చేశారు. షా గురువారం ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సీఏఏతో దేశంలోని మైనారిటీలు సహా ఎవరి సిటిజన్షిప్కూ ముప్పు లేదన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రిస్టియన్, పార్శీ శరణార్థులకు హక్కులు, సిటిజన్షిప్ కల్పించేందుకు మాత్రమే సీఏఏ అవకాశం కల్పిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.