ఆ అధికారం అసెంబ్లీకి లేదు.. కేవలం పార్లమెంటుకే

ఆ అధికారం అసెంబ్లీకి లేదు.. కేవలం పార్లమెంటుకే

పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీలకు లేదనీ… కేవలం పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. సీఏఏని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ మేరకు స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలోని ఏ పౌరుడికీ సంబంధం లేదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం మొదలైందని పేర్కొన్నారు.