హైదరాబాద్లో రైలెక్కి.. స్టేషన్ఘన్పూర్కు .. బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు

హైదరాబాద్లో రైలెక్కి.. స్టేషన్ఘన్పూర్కు .. బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: హైదరాబాద్​కు చెందిన ఓ బాలుడు రైలెక్కి స్టేషన్​ఘన్​పూర్​చేరుకున్నాడు.. పోలీసులు అతని వివరాలు తెలుసుకొని హైదరాబాద్​తీసుకెళ్లి, తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని దుండిగల్​కు చెందిన పుష్పలీల కుమారుడు గణేశ్(8) బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చాడు. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో రైలెక్కి, మధ్యాహ్నం స్టేషన్​ఘన్​పూర్​ రైల్వేస్టేషన్​లో దిగాడు. బైక్​లపై వెళ్లేవారిని లిఫ్ట్​అడుగుతూ.. నమిలిగొండ బస్టాప్​వద్దకు చేరుకున్నాడు. అక్కడి చెరువులో ఈత కొట్టి, గ్రామంలోకి నడిచి వెళ్లాడు. వీధుల్లో తచ్చాడుతున్న ఆ బాలుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతన్ని ఠాణాకు తీసుకెళ్లారు. 

వివరాలు అడగా తన పేరు గణేశ్, తల్లి పేరు పుష్పలీల అని తెలిపాడు. హైదరాబాద్​లోని దుండిగల్ లో ఉంటామని, ఎస్ఆర్​నగర్​ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నానని చెప్పాడు. సీఐ వేణు అక్కడి పోలీస్ స్టేషన్లకు ఫోన్​చేసి, వాకబు చేశారు. బాలుడి తల్లి పుష్పలీలతో ఫోన్​లో మాట్లాడగా.. తన కొడుకు ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. కానిస్టేబుల్ సాయిచరణ్ గురువారం గణేశ్​ను హైదరాబాద్​తీసుకెళ్లి, అతని తల్లికి అప్పగించారు.