స్టీల్, పవర్, సిమెంట్ కంపెనీలకు భారీగా బొగ్గు గనులు 

స్టీల్, పవర్, సిమెంట్ కంపెనీలకు భారీగా బొగ్గు గనులు 
  • లక్ష మందికి ఉపాధి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో (ఆరవ రౌండ్ ) స్టీల్, పవర్ సిమెంట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో బొగ్గుగనులను దక్కించుకున్నాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్ ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బనాయ్, భలుముండా గనులను, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పర్బత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ సెంట్రల్, సీతానాల గనులను గెలుచుకుంది. జేఎస్​డబ్ల్యూ సిమెంట్ మధ్యప్రదేశ్ లోని మార్వాటోలా–7 గనిని కైవసం చేసుకుంది. జిందాల్ పవర్ ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న గారే పాల్మా సెక్టార్–1, గారే పాల్మా 4/2 గారే పాల్మా 4/3 బొగ్గు గనులను గెలుచుకుంది.

రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒడిశాలోని సఖిగోపాల్–బి కంకిలి ఛెందిపడ (రివైజ్డ్) బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చోరిటాండ్ తిలియాయాను కైవసం చేసుకుంది. జార్ఖండ్, ఒడిశాలోని పాటల్ ఈస్ట్ (తూర్పు భాగం) గనిని ఆర్​సీఆర్​ స్టీల్ వర్క్స్ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాగ్రా జోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేవ్ గనిని మెటలర్జికల్ ఇండస్ట్రీ దక్కించుకుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ మహారాష్ట్రలోని దహెగావ్–గోవారీ గనిని, అల్ట్రాటెక్ సిమెంట్ మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అర్జుని ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, దాల్మియా సిమెంట్ (భారత్) మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మాండ్లా నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది.