ఢిల్లీలో గన్స్​ గ్యాంగ్స్​!

ఢిల్లీలో గన్స్​ గ్యాంగ్స్​!

ఢిల్లీ.. దేశ రాజధాని. పొలిటికల్​, సెంట్రల్​ గవర్నమెంట్​ పెద్దలంతా అక్కడే ఉంటారు. ప్రెసిడెంట్​, వైస్​ ప్రెసిడెంట్​, పీఎం, సీఎం,​ మినిస్టర్లు, ఎంపీలు తదితర వీవీవీఐపీలు అందరూ ఆ నగరంలో  దేశ పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా గడుపుతుంటారు. రాష్ట్రపతి భవన్​, పార్లమెంట్​, సుప్రీంకోర్టు, ఇండియా గేట్​, రెడ్​ ఫోర్ట్​ ఇలా ఎన్నో ముఖ్య ప్రదేశాలకు ఢిల్లీయే​ నిలయం. అక్కడ సెక్యూరిటీ హై రేంజ్​లో కట్టుదిట్టంగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా పోలీసులు క్షణాల్లో పట్టేస్తారని ఆశిస్తాం. అంత స్ట్రాంగ్‌‌ సెక్యూరిటీ ఉన్నచోట ఇటీవలి గ్యాంగ్​స్టర్ల ఫైరింగ్​లు, స్ట్రీట్‌‌ ఫైట్‌‌లు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశమంంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో క్యాపిటల్​ సిటీ ఢిల్లీ స్ట్రీట్‌‌ ఫైటింగ్‌‌లు, గ్యాంగ్‌‌స్టర్ల కాల్పులతో గజగజలాడింది. గడిచిన నెల రోజుల్లో మొత్తం 43 గన్​ ఫైరింగ్​ ఇన్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు 220 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.  మే 17 నుంచి జూన్​ 15 వరకు జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోపోయారు. 22 మంది గాయపడ్డారు. తుపాకులతో కాకుండా కత్తులతో, ఇతర వెపన్లతోకూడా దాడులకు తెగబడ్డ ఘటనలు వీటికి అదనం. సిటీ బయటి ప్రాంతాల కన్నా సెంట్రల్​, సౌత్​, వెస్ట్​ ఢిల్లీల్లో ఈ బుల్లెట్ల​ షూటింగ్​లు ఒకేసారి వెలుగుచూడటంపై పోలీసు పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిటీ అంతా ఇదే పరిస్థితి
గన్​ షాట్లు సిటీలోని అన్ని ఏరియాల్లోనూ జరిగాయి. సౌత్​లోని బారాపుల్లా ఫ్లైఓవర్​ నుంచి సెంట్రల్​ ఢిల్లీలోని కరోల్​బాగ్​ వరకు; వెస్ట్​లోని ద్వారకా నుంచి ఈస్ట్​లోని కల్యాణ్​పురి వరకు గూండాలు ఢిష్యూం ఢిష్యూంలకు దిగారు. ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. కాల్పుల్లో చనిపోయినవారిలో గ్యాంగ్​స్టర్లు, సోషల్​ మీడియా స్టార్లు, ప్రాపర్టీ డీలర్లు, జ్యూయెలర్లు, హోటల్స్​ వర్గాలు, జర్నలిస్టులు, బిజినెస్​మెన్​లు ఉన్నారు. ప్రతి కేసులోనూ ఇల్లీగల్​ పిస్టళ్ల​నే వాడినట్లు తేలింది. తొమ్మిది  కేసుల్లో పోలీసులు క్రిమినల్స్​ని ఎన్​కౌంటర్లు చేశారు. వీటి కోసం 32 బుల్లెట్లు వాడారు.

పోటీదార్ల మధ్య, పాత​ గ్యాంగ్​ల్లోని ప్రత్యర్థుల మధ్య, వ్యక్తిగత కక్షలు, దొంగతనాలకు పాల్పడటం, స్నాచింగ్​, దోపిడీ యత్నాలు, పోలీస్​  షౌట్​ అవుట్లు వంటి కారణాల వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి. బజార్లు, ఆఫీసులు, రెస్టారెంట్లు, షాపులు తదితర ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి. ఈ ఏడాది మినహా గతంలో ఇలాంటివి ఎన్ని జరిగాయనే డేటా పోలీసుల వద్ద లేదు. గూండాల కాల్పుల ఘటనలకు సంబంధించి సిటీ వైడ్​ రికార్డ్​ను పోలీసులు మెయింటైన్ చేయలేదు. స్టేషన్ల వారీగా మాత్రమే నేరాలను నమోదు చేశారు. సెటిల్​మెంట్లు, దందాలను క్రిమినల్స్​ పట్టపగలే, నడి రోడ్ల పైనే చేస్తున్నారని సీనియర్​ పోలీస్​ ఆఫీసర్లు పలువురు అంటున్నారు. తాము అనుకున్నది సాధించుకోవటానికి నేరగాళ్లు ఓపెన్​గానే బాధితుల తలకు గన్ను గురిపెట్టి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి నెలకొనటం చింతించాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల్లో 15  ఎన్​కౌంటర్లు
‘నేరగాళ్లు రాన్రానూ మొండిగా తయారవుతున్నారు. ఈమధ్య అరెస్టయినవాళ్లలో హార్డ్​కోర్​ గ్యాంగ్​స్టర్లు పెద్దగా లేరు. కానీ చోటా క్రిమినల్స్​ కూడా ఇటీవల పోలీసులంటే భయం గానీ, కోర్టుల్లో శిక్షలు పడతాయనే ఆలోచన గానీ లేకుండా వీధుల్లోకి వచ్చి శత్రువులపై విచ్చలవిడిగా ఫైరింగ్​ చేస్తున్నారు. రీసెంట్​గా ఈ రెండు నెలల్లో 10–15 పోలీస్​ ఎన్​కౌంటర్లు జరిగాయి. ఇందులో ఎక్కువ మంది తొలిసారి నేరానికి పాల్పడ్డవారే కావటం గమనార్హం’ అని ఓ అధికారి అన్నారు.

ఆఫీసర్లూ.. గస్తీలో పాల్గొనండి
ఢిల్లీలో ఫైరింగ్​లు పెరుగుతుండటంతో లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ 10 రోజుల కిందట మీటింగ్​ పెట్టారు. సీనియర్​ పోలీసు అధికారులు ఆఫీసుల నుంచి బయటకొచ్చి రోడ్లపై రాత్రీ పగలూ గస్తీ తిరగాలని ఆదేశించారు.​ దీనిపై సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కూడా స్పందించారు.​ క్యాపిటల్​లోని​ ‘లా అండ్​  ఆర్డర్’ను చక్కదిద్దాలని కేంద్రాన్ని, ఎల్జీని కోరారు. క్రైమ్​ రేట్​ను తగ్గించటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ పోలీస్​ చీఫ్​ అమూల్య పట్నాయక్ పెద్దాఫీసర్లతో చర్చించారు. ఇవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.