అనుమతి లేని హాస్పిటల్స్​పై చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్​ఓ భాస్కర్​ నాయక్​ 

అనుమతి లేని హాస్పిటల్స్​పై చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్​ఓ భాస్కర్​ నాయక్​ 

  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అనుమతి లేకుండా హాస్పిటల్స్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డాక్టర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. భాస్కర్ హెచ్చరించారు.  ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  డీఎంహెచ్​ఓ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  క్లినికల్​ ఎస్టాబ్లిష్​మెంట్​చట్టం ప్రకారం ఎవరికి మినహాయింపు ఉండదన్నారు.  

ప్రతి ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అగ్నిమాపక భద్రత ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్హత లేని డాక్టర్లు, పారామెడికల్​ సిబ్బంది పనిచేసే హాస్పటల్స్​పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్​ఓలు డాక్టర్​ జయలక్ష్మి, డాక్టర్​ చైతన్య, ప్రోగ్రాం ఆఫీసర్లు మధువరన్​, పుల్లారెడ్డి, తేజశ్రీ, డిప్యూటీ డెమో మహ్మద్​ ఫైజుద్దీన్​ పాల్గొన్నారు.