- టీచర్ డిప్యూటేషన్ పై పంపించడంతో విద్యార్థుల ఆవేదన
- ఎంఈవోను కలిసి వినతి
జైపూర్(భీమారం), వెలుగు: మాకు ఆ మేడమే పాఠాలు చెప్పాలని, తమ టీచర్ను డిప్యూటేషన్పై పంపొద్దని మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కోరారు. తల్లిదండ్రులపాటు వెళ్లి ఎంఈవో శ్రీనివాస్ ను కలిసి వేడుకున్నారు. ప్రైమరీ స్కూల్లో 67 మంది విద్యార్థులు చదువుతుండగా నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. కాగా పరిమళ అనే ఇంగ్లీష్ టీచర్ను అధికారులు మండలంలోని ధర్మారం స్కూల్కు డిప్యూటేషన్ పై పంపించారు.
దీంతో ఆ స్కూల్ విద్యార్థులు మంగళవారం ఎంఈవోను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పరిమళ మేడమ్ను మరోచోటికి పంపితే తాము స్కూల్కు వెళ్లమని పేర్కొన్నారు. ఆ టీచర్ ఉంటేనే తమ పిల్లలను స్కూల్ కు పంపిస్తామని తల్లిదండ్రులు సైతం స్పష్టం చేశారు. ఎంఈవోకు వినతిపత్రం అందించారు.
