భద్రాద్రికొత్తగూడెం జిల్లా : రావి చెట్టుకు రాఖీ కట్టిన స్టూడెంట్స్..వృక్ష రక్షా బంధన్ కార్యక్రమం

భద్రాద్రికొత్తగూడెం జిల్లా : రావి చెట్టుకు రాఖీ కట్టిన స్టూడెంట్స్..వృక్ష రక్షా బంధన్ కార్యక్రమం

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జడ్పీ హైస్కూల్​ స్టూడెంట్లు, టీచర్లు గురువారం ‘వృక్ష రక్షా బంధన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్​ ఎకో క్లబ్, నేషనల్  గ్రీన్  కోర్  ఆధ్వర్యంలో రావి చెట్టుకు ఆకులు, పూలతో చేసిన రాఖీ కట్టారు. స్కూల్​ హెచ్ఎం, ఎంఈవో ఉండేటి ఆనంద కుమార్  మాట్లాడుతూ వృక్షాలను కాపాడాలనే సందేశం ఇచ్చేందుకు ప్రతి ఏడాది చెట్లకు రాఖీలు కడుతున్నట్లు తెలిపారు.