- శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్
- రెండో రోజు కొనసాగిన సింగరేణి కంపెనీ లెవల్అథ్లెటిక్స్పోటీలు
కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, నిరంతర సాధనతో విజయాలు సాధ్యమని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ఏరియాలోని శాంతి మైదానంలో వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కంపెనీ లెవల్అథ్లెటిక్స్, త్రోబాల్, స్విమ్మింగ్పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు జీఎం చీఫ్గెస్ట్గా హాజరై విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ లెవల్అథ్లెటిక్స్పోటీల్లో ఉద్యోగులు పట్టుదల, క్రమశిక్షణతో ఆడడం అభినందనీయమన్నారు. కోల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం, స్పోర్ట్స్వైస్ప్రెసిడెంట్ఎన్.సత్యనారాయణ, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్ ఎస్కే బాజీసైదా, ఆఫీసర్స్ సంఘం ప్రెసిడెంట్ కె.వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, స్పోర్ట్స్ఆఫీసర్లు, స్పోర్ట్స్ సూపర్వైజర్, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
