ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేసిన మోదీ.. సామాజిక సేవ, విద్యసహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు చెప్పారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనమన్నారు. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు మోదీ.
ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధా మూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుక అంటూ.. ఇవాళ ఉదయమే వంటింటి గ్యాస్ ధరపై రూ. 100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.తాము మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024