సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్వంత్’. బన్నీవాస్, వంశీ నందిపాటి శుక్రవారం థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్. బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అవుతుందనే నమ్మకం ఉంది. ‘హే బల్వంత్’ అనేది సుహాస్ 2.ఓ అని గ్యారెంటీ ఇస్తున్నా’ అని అన్నాడు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ 650 పైగా స్క్రీన్లలో మా సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. వన్ మంత్ డైట్ చేయాల్సిన అవసరం లేకుండా.. వన్ మంత్ జిమ్, రన్నింగ్కి వెళ్లాల్సిన పని లేదు. ఒక్క మూడు గంటలు మాకిస్తే.. వన్ మంత్కి సరిపడే ఆరోగ్యాన్ని మేం ఇస్తాం.
ఈ స్టోరీలో మంచి ఎమోషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’ అని అన్నారు. సినిమా విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. హీరోయిన్ శివానీ, నటులు వీకే నరేష్, సుదర్శన్ పాల్గొన్నారు.
