బహ్రెయిన్ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం
ప్రేయసి కుటుంబీకులను శిక్షించాలంటూ రాస్తారోకో
మాక్లూర్, వెలుగు: లవర్ మోసం చేసిందంటూ ఓ యువకుడు బహ్రెయిన్లో 10 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం స్వగ్రామానికి చేరడంతో కుటుంబీకులు, బంధువులు యువతి కుటుంబీకులను శిక్షించాలంటూ శనివారం ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని రాంచెంద్రాపల్లి గ్రామానికి చెందిన ఐండ్ల సుధీర్(24), అదే గ్రామానికి చెందిన యువతి నాలుగేండ్లుగా ప్రేమించుకున్నారు.పెండ్లి చేసుకుందామంటే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. డబ్బులు సంపాదించుకున్న తర్వాత పెండ్లి చేసుకుందామని, రెండేండ్ల క్రితం సుధీర్బహ్రెయిన్వెళ్లాడు. కొంతకాలం ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. అదే గ్రామానికి చెందిన పెళ్లైన యువకుడితో యువతి ప్రేమ వ్యవహారం నడుపుతోందని సుధీర్కు తెలిసింది. ప్రేమికురాలిని ఫోన్లో హెచ్చరించినా వినలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది తాను ప్రేమలో మోసపోయానని, సూసైడ్ చేసుకుంటున్నట్లు ఈ నెల 15న బంధువులకు వాయిస్ మెసేజ్చేసి రూంలో ఉరేసుకున్నాడు. శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం కుటుంబీకులు శవంతో రాంచెంద్రపల్లికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని పంచాయతీ ముందు టెంట్వేసుకుని మూడు గంటలపాటు బైఠాయించారు. అనంతరం ఇక్కడైతే తమ సమస్య పరిష్కారం కాదని బంధుమిత్రులు శవంతో 66వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. 2 గంటలపాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా వెహికల్స్నిలిచిపోయాయి. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ ఆందోళనకారులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో
విరమించారు.