పరువు నష్టం కేసులో కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గేకు సమన్లు

పరువు నష్టం కేసులో కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గేకు సమన్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బజరంగ్​దళ్​ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. సంగ్రూర్​కు చెందిన ఆ సంఘం వ్యవస్థాపకుడు హితేష్​ భరద్వాజ్​ స్థానిక జిల్లా కోర్టులో ఖర్గే పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు సివిల్​ జడ్జి రమణదీప్​ కౌర్, ​ఖర్గేకు సమన్లు జారీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ బజరంగ్​దళ్​ ని దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని సంగ్రూర్​ ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే  బజరంగ్​దళ్​ను బ్యాన్​ చేస్తామని అనడం, అదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడంపై ఆ సంఘం కార్యకర్తలు గతంలోనే నిరసనలు తెలిపారు.  ఇందుకు నిరసనగానే తాను కోర్టు ను ఆశ్రయించినట్లు సంగ్రూర్​ తెలిపారు.