కోల్‌‌‌‌‌‌కతాకు  హైదరాబాద్‌‌‌‌ షాక్‌‌‌‌.. నితీష్‌‌‌‌, రింకూ పోరాటం వృథా

కోల్‌‌‌‌‌‌కతాకు  హైదరాబాద్‌‌‌‌ షాక్‌‌‌‌.. నితీష్‌‌‌‌, రింకూ పోరాటం వృథా

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా:  సన్​రైజర్స్ హైదరాబాద్​ రూ.13.25 కోట్లు పోసి కొన్న హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 100 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఎట్టకేలకు తన రేటుకు తగ్గ ఆట చూపెట్టాడు. గత మూడు మ్యాచ్​ల్లో ఫెయిలైన ఈ ఇంగ్లండ్​ యంగ్​స్టర్​ ఈసారి ఈడెన్​ గార్డెన్​ లో తన విశ్వరూపం చూపించాడు. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా బౌలర్లను ఊచకోత కోస్తూ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి సెంచరీతో పరుగుల సునామీ సృష్టించాడు. అతనికి కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 50) అండగా నిలవడంతో.. శుక్రవారం రాత్రి జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 228/4 స్కోరు చేసింది. తర్వాత కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా 20 ఓవర్లలో 205/7 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నితీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా (41 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 75), రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 58 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చెలరేగినా ప్రయోజనం లేకపోయింది. బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఇద్దరూ.. ఇద్దరే

టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటే హైలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు ఫోర్లతో మొదలైన బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధ్వంసం చివరి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు సాగింది. మధ్యలో మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చెలరేగడంతో ఆట మరో మెట్టు ఎక్కింది. ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0/42) వేసిన థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో రెచ్చిపోయాడు. కానీ రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/22) వేసిన ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మయాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9) ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కావడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 46 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసింది. రెండు ఫోర్లు కొట్టి రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రిపాఠి (9) ఇదే ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కావడంతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 57/2తో నిలిచింది. బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసిన మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించినా ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ఈ దశలో స్పిన్నర్లు వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి (1/41), నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0/28) చెరో ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే సరిపెట్టినా, 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుయాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (0/44)కు మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్వాగతం పలికాడు. దీంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో 65/2తో ఉన్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి పది ఓవర్లలో 94/2కు పెరిగింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరు రన్సే ఇవ్వగా,  బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 32 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  6, 6, 4తో 16 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టిన మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4, 6 కొట్టి వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్నాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 72 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0/37) వేసిన 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6, 4, 4, 4 రాబట్టాడు. యంగ్​స్టర్​ అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 32) కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝుళిపించడంతో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయువేగంతో పరుగెత్తింది. వరుస ఓవర్లలో అతను మూడు ఫోర్లు, రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో రెచ్చిపోయాడు. డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపడంతో ఫోర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 72 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఇదే ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4, 4, 4తో 95లోకి వచ్చాడు. చివరకు ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 20వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపి సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి సెంచరీని సాధించాడు. క్లాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాదడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్దేశించింది. 

మెరుపులు సరిపోలే..

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాకు సరైన ఆరంభం దక్కకపోయినా చివరి వరకు పోరాటం చేశారు. మధ్యలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెత్త ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్​లు  డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుర్బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) ఔటైతే, నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/37).. వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10), సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాడు. దీంతో కేకేఆర్​ 20/3తో డీలా పడింది.  అయితే, అప్పటికే క్రీజులో ఉన్న జగదీశన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (36)కు తోడైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నితీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఉమ్రాన్ (1/26)​ వేసిన ఆరో ఓవర్లో రాణా నాలుగుఫోర్లు, రెండు సిక్సర్లతో 28 రన్స్​ పిండుకున్నాడు.ఇద్దరు బ్యాటర్లు పోటీపడి బౌండ్రీలు బాదడంతో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడిలో పడింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్కండే (2/27) వరుస ఓవర్లలో జగదీశన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి షాకిచ్చాడు. దాంతో,  62/3తో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేను ముగించిన నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 12 ఓవర్లలో 100/5తో నిలిచింది.   ఈ దశలో లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరో రింకూ సింగ్ ఓ క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటపడి భారీ సిక్సర్లతో హోరెత్తించాడు. అతనితో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 69 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసి రాణా  17వ ఓవర్లో ఔటవడంతో ఔటవడంతో సన్​రైజర్స్ ఊపిరిపీల్చుకుంది. చివర్లో శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12), రింకూను భువీ, నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడి చేయడంతో నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఓటమి తప్పలేదు.