
అంటాల్యా: ఇండియా స్టార్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో గోల్డ్ మెడల్కు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ తన పార్ట్నర్ ఒజాస్ దియోతలేతో కలిసి ఫైనల్ దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి–ఒజాస్ జంట 157–154తో మలేసియాకు చెందిన ఫటిన్ మాట్ సలే–జువైది మజుకి ద్వయాన్ని ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో ఇండియా జోడీ.. 12వ సీడ్ చైనీస్ తైపీ ద్వయంతో పోటీ పడనుంది. మరో తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్మెన్స్ రికర్వ్లో సెమీస్ చేరి కనీసం బ్రాంజ్ ఖాయం చేసుకున్నాడు. 256వ ర్యాంకర్ ధీరజ్ క్వార్టర్స్ షూటాఫ్లో 6–5తో రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ బ్రాడీ ఎలిసన్ (అమెరికా)ను ఓడించాడు. ఇప్పటికే ధీరజ్, అటాను దాస్, తరుణ్దీప్ రాయ్తో కూడిన మెన్స్ రికర్వ్ టీమ్ ఫైనల్ చేరింది. ఈ టీమ్ ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో పోటీ పడనుంది. మరోవైపు రికర్వ్ ఈవెంట్లో ఇండియాకు నిరాశ ఎదురైంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అటాను దాస్–భజన్ కౌర్ జంట తొలి రౌండ్లోనే ఓడి ఎలిమినేట్ అయ్యింది.–