ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెస్టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియాపై ఇండియా గెలుపు

ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెస్టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియాపై ఇండియా గెలుపు

పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) ఆస్ట్రేలియాలోనూ జోరు కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగంగా వెస్టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా జట్టుతో సోమవారం జరిగిన తొలి ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్య ఫిఫ్టీతో మెరిశాడు. దాంతో ఈ పోరులో ఇండియా 13 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 158/6 స్కోరు చేసింది.  

ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3), పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9) ఫెయిలైనా.. సూర్యతో పాటు దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుడా (22), హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా (27), దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆకట్టుకున్నారు. అనంతరం అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/6), చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/15) భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/26) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దాంతో ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవర్లన్నీ ఆడిన వెస్టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా 145/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (59) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గురువారం ఇదే జట్టుతో ఇండియా మరో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతుంది.