పేరెంట్స్ మీటింగ్కు వెళ్లి మహిళ .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

పేరెంట్స్ మీటింగ్కు వెళ్లి మహిళ .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
  • ఆసిఫాబాద్ ​జిల్లాలో ఘటన 

దహెగాం, వెలుగు: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా దహెగాం మండలంలో జరిగింది. స్థానికులు, ఎస్ఐ విక్రమ్ తెలిపిన ప్రకారం.. రాళ్లగూడకు చెందిన ఆత్మకూరి కళావతి(40), సంతోష్ దంపతులకు కొడుకు అంజన్న, కూతురు ఉన్నారు. ఇటీవల భర్త ఉపాధి కోసం హైదరాబాద్​వెళ్లాడు.

 పిల్లలిద్దరూ ఇట్యాల జడ్పీ హైస్కూల్​లో చదువుతున్నారు. బుధవారం స్కూల్​లో పేరెంట్స్​మీటింగ్​ఉండడంతో కళావతి వెళ్లింది. మధ్యాహ్నం నడుచుకుంటూ  రాళ్లగూడకు బయలుదేరింది. సాయంత్రం స్కూల్​నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లి కనిపించలేదు.  ఇంటికి రాలేదని తెలుసుకుని 100 కు కాల్ చేశారు. 

దీంతో బ్లూకోల్ట్​టీం వెళ్లి సాయంత్రం వరకు వెతికారు.సెల్ ఫోన్​సిగ్నల్​ట్రేస్​చేయగా, అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు పక్కన పంట చేనులో ఆమె  శవమై కనిపించిం ది. కళావతి మెడ కు చీరతో ఉరేసి చంపినట్టు కుటుంబసభ్యులు అనుమానించారు.  

రాళ్లగూడకు చెందిన ఓ వ్యక్తి తన కోడలిని హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తూ మృతురాలి అత్త జయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.  ఘటనా స్థలాన్ని ఎస్పీ నితికా పంత్​, కాగజ్​నగర్​డీఎస్పీ వహీదుద్దీన్, కాగజ్​నగర్​రూరల్​ సీఐ కుమారస్వామి పరిశీలించారు. న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆందోళన చేసింది.