హైదరాబాద్, వెలుగు: కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో సైయంట్నికర లాభం 45 శాతం పెరిగి రూ.116 కోట్ల నుంచి రూ. 168 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా చూసినా కంపెనీ నికర లాభం పెరిగింది. ఆపరేషన్స్ రెవెన్యూ 34.91 శాతం పెరిగి రూ. 1,686.50 కోట్లయిందని కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది క్యూ 1 లో ఈ రెవెన్యూ రూ. 1,250 కోట్లు. డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రెవెన్యూ గ్రోత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 15–20 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు సైయంట్ తెలిపింది.
ఇబిటా మార్జిన్స్లో 150–250 బేసిస్ పాయింట్ల మెరుగుదలను ఆశిస్తున్నట్లు పేర్కొంది. క్యూ 1 రిజల్ట్స్ సానుకూలంగా వచ్చాయని మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ బోదనపు చెప్పారు. డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ బిజినెస్లో ఆరు లార్జ్ డీల్స్ను తాజా క్వార్టర్లో దక్కించుకోగలిగామని వెల్లడించారు. వీటి విలువ 48.8 మిలియన్ డాలర్లని చెప్పారు. సైయంట్ షేర్లు 1.16 శాతం తగ్గి రూ. 1,466 వద్ద క్లోజయ్యాయి.