300 ఏళ్లలో మొదటిసారి తాజ్ మహల్ ను క్లీన్ చేశారు

300 ఏళ్లలో మొదటిసారి తాజ్ మహల్ ను క్లీన్ చేశారు

ట్రంప్ టూర్ నేపథ్యం లో తాజ్ మహల్ లోని షాజహాన్, ముంతాజ్ ల రియల్ సమాధులను అధికారులు క్లీన్ చేశారు. తాజ్ లోపల స్పెషల్ ఛాంబర్ లో ఉన్న ఈ సమాధులకు మడ్ ప్యాక్ వేసి, డిస్టిల్డ్ వాటర్ తో శుభ్రం చేశారు. సుమారు

300 ఏళ్లకు ముందు కట్టిన సమాధులకు మొదటిసారిగా ఈ ప్రక్రియ జరిపారు. ఈ ఛాంబర్ ఎంట్రన్స్​ ఎత్తు కేవలం ఐదు అడుగులు మాత్రమే ఉండడంతో ట్రంప్ కుటుంబం ఈ సమాధు లను సందర్శించలేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నమూనాల పరిశీలనతో సరిపెట్టారు . దేశ, విదే శాలకు చెందిన ప్రముఖులు విజిట్ సందర్భంలో అతిథులు కోరితే ఈ రియల్ సమాధులను సందర్శించేం దుకు ప్రభుత్వం స్పెషల్ గా పర్మిషన్ ఇస్తుంది. మిగతా సమయాల్లో షాజహాన్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా మూడురోజులు ఈ ఛాంబర్ ను ఓపెన్ చేస్తారు. లోపల ప్రార్థనలు చేసు కునేందుకు భక్తులను అనుమతిస్తారు. ఇంతకుముందు తాజ్ మహల్ కు మడ్ ప్యాక్ థెరపీ చేసినప్పటికీ.. సమాధులను మాత్రం టచ్ చేయలేదు. సమాధులతో పాటు రాయల్ గేట్, ఛమేళి ఫ్లోర్, సెంట్రల్ ట్యాం క్ లను కూడా క్లీన్ చేశారు. పాలరాతి కట్టడమైన తాజ్ మహల్ వన్నెతగ్గుతోందని, పొల్యూషన్ తో డ్యామేజీ అవుతోందని గతంలో సర్వేల్లో తేలింది. ఇప్పటికి ఐదుసార్లు మడ్ ప్యాక్ ట్రీట్మెంట్ చేశారు. తొలిసారి 1994, తర్వాత 2001, 2008, 2014, 2019 లో డ్యామేజీ అయిన చోట్ల క్లీనింగ్ చేశారు.

గతంలో వచ్చిన ప్రముఖులు కూడా చూడలే

ఇంతకుముందు నికోలస్ సర్కోజి(ఫ్రాన్స్),వ్లాదిమిర్ పుతిన్(రష్యా), ఇమ్మాను యేల్ మాక్రన్(ఫ్రాన్స్), పర్వే జ్ ముషారఫ్(పాకి స్తాన్), బిల్ క్లింటన్(అమెరికా) తదితరులు తాజ్ మహల్ విజిట్ చేసినా.. షాజహాన్, ముంతాజ్ ల నిజమైన సమాధులను సందర్శించలేదు.