ప్రధానితో చర్చలు: రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న బంగ్లా క్రికెటర్

ప్రధానితో చర్చలు: రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న బంగ్లా క్రికెటర్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ జ‌ట్టు కెప్టెన్ త‌మీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకోవడంతోనే తమీమ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని ఓ క్రీడా ఛానల్ వెల్లడించింది. 

కాగా, బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో.. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో ఓటమి తరువాత తమీమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో తమీమ్ భావోద్వేగానికి లోనయ్యారు. కంట త‌డి పెట్టారు. త‌న తండ్రిని త‌ల్చుకుని ఏడ్చారు. 

34 ఏళ్ల తమీమ్.. బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆటగాడు. మరో మూడు వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఈ నిర్ణయమేంటని యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఏదేమైనా తమీమ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవడమన్నది బంగ్లాదేశ్ అభిమానులకు సంతోషాన్నిచ్చేదే.