లగ్జరీ వస్తువులపై టీసీఎస్..​రూ.10 లక్షలు దాటితే 1 పర్సెంట్

లగ్జరీ వస్తువులపై టీసీఎస్..​రూ.10 లక్షలు దాటితే 1 పర్సెంట్

న్యూఢిల్లీ: రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న హ్యాండ్‌‌‌‌‌‌‌‌బ్యాగులు, రిస్ట్​వాచీలు, ఫుట్​వేర్, స్పోర్ట్స్​వేర్‎పై ఒక శాతం టీసీఎస్​(ట్యాక్స్​కలెక్టెడ్​ఎట్​సోర్స్​) వసూలు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.  రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వెహికల్స్‎పై ఈ ఏడాది జనవరి నుంచే ఒకశాతం టీసీఎస్‎ను వసూలు చేస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ ఏప్రిల్ 22న లగ్జరీ వస్తువుల వివరాలను జాబితాను నోటిఫై చేసింది. 

వీటిలో రిస్ట్​వాచీలు, పెయింటింగ్‌‌‌‌‌‌‌‌లు, శిల్పాలు,  పురాతన వస్తువుల వంటి కళాఖండాలు, నాణేలు  స్టాంపులు, యాట్‎లు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్‌‌‌‌‌‌‌‌బ్యాగులు, సన్ గ్లాసెస్, ఫుట్​వేర్, హై-ఎండ్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌వేర్, ఎక్విప్​మెంట్, హోమ్ థియేటర్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లు,  రేసింగ్ లేదా పోలో కోసం వాడే గుర్రాలు వంటివి  ఉన్నాయి. ఈ వస్తువులను విక్రయించే సమయంలో కొనుగోలుదారు నుంచి టీసీఎస్​ వసూలు చేస్తారు.

 ఐటీ రిటర్న్‌‌‌‌‌‌‌‌లను దాఖలు చేసే సమయంలో కొనుగోలుదారుడు  తను కట్టే పన్ను మొత్తంలో సర్దుబాటు చేయవచ్చు. టీసీఎస్ వల్ల​ ప్రభుత్వానికి ఎటువంటి అదనపు ఆదాయం రాదు. కొనుగోలు సమయంలో పాన్​కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అధిక విలువ ఖర్చులను గుర్తించడం పన్ను శాఖకు వీలవుతుంది.  టీసీఎస్‎ను వసూలు చేసే బాధ్యత అమ్మకందారుడిపైనే ఉంటుంది.