ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా, మోపాల్ మండల కేంద్రం, డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి వర్ని మండలం, రుద్రూర్ మండలంలో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలో వర్ధంతిలో భాగంగా నివాళులర్పించారు. బోధన్, సాలూరా మండలాల్లో వర్ధంతిని నిర్వహించగా, బోధన్లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ రూరల్/ వర్న/ కోటగిరి/ బోధన్, వెలుగు
