కాంగ్రెస్ కు టీడీపీ నేతల మద్దతు

కాంగ్రెస్ కు టీడీపీ నేతల మద్దతు

వనపర్తి, వెలుగు: వనపర్తి కాంగ్రెస్  అభ్యర్థి మేఘారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం వనపర్తిలోని టీడీపీ ఆఫీస్​కు కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి తూడి మేఘారెడ్డిని ఆహ్వానించి తమ మద్దతు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డిని గెలిపించుకొనేందుకు పని చేస్తామని పార్టీ పార్లమెంట్​ ఇన్​చార్జి బి.రాములు, మాజీ జడ్పీటీసీ వెంకటయ్య యాదవ్, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, టీడీపీ లీడర్లు వెల్టూర్ శ్రీనివాస్ రెడ్డి, రామన్ గౌడ్, హుస్సేన్,  శ్రీనివాసులు, గంధం రాజు,  బాలయ్య, యాదగిరి,  చిన్నయ్య, ఆవుల శ్రీనివాసులు పాల్గొన్నారు .

అంతకుముందు బీఆర్ఎస్  పెబ్బేరు మండల అధ్యక్షుడు మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్  గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా బీఆర్ఎస్  పార్టీ లీడర్లు గ్రామాలు, మండలాల్లో పోలీసు, రెవెన్యూ అధికారుల తమ ఆధీనంలో పెట్టుకొని ప్రజల హక్కులను హరించారని విమర్శించారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్  పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.