శభాష్.. దిలీప్ కుమార్..లక్సెట్టిపేట స్కూల్లో జీరో నుంచి 110 మందికి పెరిగిన స్టూడెంట్లు : డాక్టర్ నవీన్ నికోలస్

శభాష్.. దిలీప్ కుమార్..లక్సెట్టిపేట స్కూల్లో జీరో నుంచి 110 మందికి పెరిగిన స్టూడెంట్లు : డాక్టర్ నవీన్ నికోలస్
  • స్ట్రెంత్​ పెంచేలా కృషి చేసిన టీచర్​ను సన్మానించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్​ నికోలస్​

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడ ఎంపీపీ స్కూల్​లో విద్యార్థుల సంఖ్యను జీరో నుంచి 110 మందిని పెంచినందుకు ఆ స్కూల్ టీచర్​దిలీప్ కుమార్​ను రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. 2024లో దిలీప్ కుమార్​కు ఈ స్కూల్​లో పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఒక్క విద్యార్థి కూడా లేడు. 

బడిబాట కార్యక్రమం ద్వారా ఆయన ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి విద్యార్థులను స్కూల్​లో చేర్పించారు. ఆయన కృషితో ఒక్క ఏడాదిలోనే విద్యార్థుల సంఖ్య 110కు చేరింది. దీంతో మంగళవారం హైదరాబాద్​లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో దిలీప్​ను నవీన్​ నికోలస్​అభినందించారు.