
మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్లో ఈనెల 23న పాకిస్తాన్తో ఆడే తొలి మ్యాచ్కు తమ తుది జట్టు కూర్పు ఖరారైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. శనివారం జరిగిన కెప్లెన్ల మీటింగ్లో రోహిత్ మాట్లాడాడు. ‘ఆఖరి నిమిషాల్లో తీసుకునే నిర్ణయాలు, చేసే మార్పులను నేను నమ్మను. టీమ్ సెలెక్షన్ గురించి ముందే ప్లేయర్లకు చెబితే.. వాళ్లు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అందుకే పాక్తో మ్యాచ్కు ఫైనల్ ఎలెవన్ను డిసైడ్ చేశాం.
ఈ విషయాన్ని ప్లేయర్లకు కూడా చెప్పేశాం. అయితే ప్రతిసారి పాక్తో మ్యాచ్ గురించి పదేపదే చర్చ అవసరం లేదు. ఇప్పటికే ఆసియా కప్లో ఆడాం. ఈ పోరును కూడా కేవలం మ్యాచ్గానే పరిగణిస్తాం’ అని రోహిత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అన్ని జట్లు భయం లేకుండా ఆడుతున్నాయని, తాము కూడా అదే తీరుతో వెళ్తామన్నాడు.