అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌తో ఇండియా తొలి పోరు

అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌తో ఇండియా తొలి పోరు
  •  అండర్‌‌‌‌-19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కొత్త షెడ్యూల్‌‌‌‌ విడుదల

దుబాయ్‌‌‌‌ : అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కొత్త షెడ్యూల్‌‌‌‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. ఈ టోర్నీని శ్రీలంక నుంచి సౌతాఫ్రికాకు తరలించడంతో షెడ్యూల్‌ను మార్చాల్సి వచ్చింది.  జనవరి 19న జరిగే డబుల్‌‌‌‌ హెడర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లతో మెగా టోర్నీ ఆరంభం కానుంది.

ఆ రోజు ఐర్లాండ్‌‌‌‌.. అమెరికాతో, వెస్టిండీస్‌‌‌‌.. సౌతాఫ్రికాతో తలపడతాయి. ఇక టీమిండియా 20న జరిగే తొలి పోరులో బంగ్లాదేశ్‌‌‌‌తో తలపడనుంది. 25న ఐర్లాండ్‌‌‌‌తో, 28న అమెరికాతో ఆడనుంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌‌‌‌లుగా విభజించారు.

గ్రూప్‌‌‌‌–ఎలో ఇండియా, బంగ్లాదేశ్‌‌‌‌, ఐర్లాండ్‌‌‌‌, అమెరికా.. గ్రూప్‌‌‌‌–బిలో ఇంగ్లండ్‌‌‌‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌‌‌‌, స్కాట్లాండ్‌‌‌‌.. గ్రూప్‌‌‌‌–సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, నమీబియా, జింబాబ్వే.. గ్రూప్‌‌‌‌–డిలో అఫ్గానిస్తాన్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌, నేపాల్‌‌‌‌ ఉన్నాయి.