ఆర్మీ జవాన్ కు కన్నీటి వీడ్కోలు

 ఆర్మీ జవాన్ కు కన్నీటి వీడ్కోలు

బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్​ మండలం వర్తమన్నూర్  గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్  నలువల ఆకాశ్(23) ట్రైనింగ్​లో భాగంగా రన్నింగ్  చేస్తూ డీహైడ్రేషన్ కు గురై చనిపోయాడు. మంగళవారం ఆయన డెడ్​బాడీ స్వగ్రామం చేరుకోగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇచ్చోడ నుంచి బంధువులు, స్నేహితులు, యువకులు త్రివర్ణ పతకాలతో వర్తమన్నూర్  వరకు బైక్  ర్యాలీ నిర్వహించారు. ఆడేగామ, పిప్పిరి గ్రామాల మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. కాంగ్రెస్​ బోథ్  నియోజకవర్గ ఇన్​చార్జి ఆడె గజేందర్  పాల్గొని జవాన్ కు నివాళులు అర్పించి, ఆయన ఫ్యామిలీకి రూ.50 వేల ఆర్థికసాయం అందించారు.