
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా క్యూ2 లాభం 61 శాతం తగ్గి రూ. 505 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ లాభం రూ. 1,299 కోట్లు. సెప్టెంబర్ 2023 క్వార్టర్లో రెవెన్యూ 2 శాతం తగ్గిపోయి రూ. 12,864 కోట్లయిందని, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో రెవెన్యూ రూ. 13,130 కోట్లని టెక్ మహీంద్రా రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.