- ఇద్దరు ఈఎన్సీలు, ఇద్దరు సీఈలతో ఏర్పాటు
- ఇరిగేషన్ అధికారులతో జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భేటీ
హైదరాబాద్, వెలుగు: కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై అధ్యయనానికి టెక్నికల్ కమిటీ ఏర్పాటు కానుంది. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్కమిషన్చైర్మన్జస్టిస్ఘోష్సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్రావు, సీడీవో (సెంట్రల్డిజైన్స్ఆర్గనైజేషన్) సీఈ, రామగుండం సీఈ ఉంటారు. ప్రాజెక్టుకు చేసే రిపేర్లు, ఇతరత్రా టెక్నికల్అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. గురువారం బీఆర్కే భవన్లో ఇరిగేషన్ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతో జస్టిస్ ఘోష్సమావేశమయ్యారు. బ్యారేజీకి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఈఎన్సీలతో ఆయన చర్చించినట్టు తెలిసింది. బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ సందర్భంగా బ్యారేజీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలనూ అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. కాగా, ఎంక్వైరీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో జస్టిస్ఘోష్ఉన్నట్టు ఇంజినీర్లు చెబుతున్నారు.
ఎన్డీఎస్ఏ నివేదికపై ఆరా..
మేడిగడ్డ బ్యారేజీపై ఇప్పటికే వచ్చిన రిపోర్టులతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన రిపోర్టు గురించి కూడా జస్టిస్ఘోష్ఆరా తీసినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను ఇరిగేషన్ అధికారులకు ఇప్పటికే పంపించింది. రిపేర్లు చేసినా బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్ బాగవుతుందన్న గ్యారంటీ లేదంటూ కమిటీ రిపోర్టులో పేర్కొన్న అంశాన్ని ఘోష్ కు అధికారులు వివరించినట్టు తెలిసింది. ఈ ఫ్లడ్సీజన్కు ముందే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను ఎత్తి ఉంచాలన్న విషయాన్ని కూడా చెప్పినట్టు సమాచారం. బ్యారేజీల వద్ద మరోసారి చేయాల్సిన టెస్టుల గురించి జస్టిస్ ఘోష్కు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన సజెషన్/విట్నెస్బాక్సుల్లో పదుల సంఖ్యలో ప్రజల నుంచి అఫిడవిట్లు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ రెండు బాక్సులూ నిండిపోయాయని చెబుతున్నారు. ఎన్నికలయ్యాక ఆ బాక్స్లను ఓపెన్చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.