వ్యాక్సిన్​ తీసుకునేందుకు ముందుకు రాని టీనేజర్లు

వ్యాక్సిన్​ తీసుకునేందుకు ముందుకు రాని టీనేజర్లు
  • ఒక్కో సెంటర్​లో సగం కూడా బుక్ ​కాని స్లాట్స్
  • 156 సెంటర్లలో ఒక శాతం వ్యాక్సినేషన్​ పూర్తి
  • సిటీ పరిధిలో నేటి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో సోమవారం నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ​మొదలైంది. వ్యాక్సిన్ ​తీసుకునేందుకు మొదటి రోజు పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఒక శాతం చొప్పున వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 3 జిల్లాల్లో మొత్తం 156  సెంటర్లు ఏర్పాటు చేయగా ఒక్కో సెంటర్​కి 200 నుంచి 500 వరకు స్లాట్స్ ఇచ్చారు. కాగా సోమవారం ఒక్కోదానిలో సగం కూడా బుక్​ కాలేదు.

29 వేల మందికి వ్యాక్సిన్ ​వేయాలని టార్గెట్ ​పెట్టుకోగా రీచ్ కాలేదు. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సెంటర్ల వద్ద అస్సలు రద్దీనే కనిపించలేదు. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 – 50 మందికి మించి వ్యాక్సిన్​వేయించుకోలేదని మెడికల్ ఆఫీసర్లు చెప్పారు. ఒకటి, రెండు చోట్ల మాత్రమే 100మందికి పైగా వ్యాక్సిన్ ​తీసుకున్నారన్నారు. ఇలాగే కొనసాగితే వ్యాక్సినేషన్ ​ప్రాసెస్ ​మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నేటి నుంచి సిటీలో స్పాట్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో వ్యాక్సిన్ వేయనున్నట్లు డీఎం హెచ్​వో డాక్టర్ వెంకటి తెలిపారు.
టార్గెట్ రీచ్ కాలే..
15 నుంచి18 ఏండ్లున్న వారు హైదరాబాద్​జిల్లాలో 2లక్షల30 వేల మంది, రంగారెడ్డిలో 2.2లక్షల మంది, మేడ్చల్​లో 1.3లక్షల మంది ఉన్నట్లు హెల్త్​ ఆఫీసర్లు గుర్తించారు. సోమవారం హైదరాబాద్​లో 1,84,822 మంది టీనేజర్లకు వ్యాక్సిన్​ వేయాలని టార్గెట్ పెట్టుకోగా మొదటిరోజు 2,265 మంది మాత్రమే తీసుకున్నారు. రంగారెడ్డిలో 1,77,102 మందికి గానూ 1,876 మంది, మేడ్చల్ లో 1,65,618 మందికి గానూ1,902 మంది టీకాలు వేయించుకున్నారు. ఆధార్ కార్డు, స్టూడెంట్ ఐడీలతో వెళ్లిన వాళ్లకు స్పాట్​లోనే బుక్ చేసి వాక్సిన్ వేస్తారని చెప్పినా స్పందన లేదు. ఆన్​లైన్ ​స్లాట్​బుకింగ్​ప్రాసెస్  కారణంగానే రెస్పాన్స్ తగ్గిం
దని మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు. చాలామంది పిల్లలకు పోర్టల్​లో లాగిన్ అవడం, వివరాలు నమోదు చేయడం వంటివి తెలియకపోవడం
తోనే ఇలా జరిగిందంటున్నారు. 
ప్రాంతాల వారీగా ఇలా..
బన్సీలాల్​పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీ  గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్​లో సోమవారం 11 మంది స్లాట్ బుక్​ ​చేసుకోగా 8 మంది వ్యాక్సిన్​తీసుకున్నట్లు మెడికల్​ ఆఫీసర్ డా.కిరణ్ ​తెలిపారు. బోయిగూడ యూపీహెచ్​సీలో 29 మంది బుక్​చేసుకుని 22మంది వ్యాక్సిన్​ వేయించుకున్నారు. కంటోన్మెంట్, సికింద్రాబాద్​పరిధిలోని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. బొల్లారం జనరల్​ హాస్పిటల్ సెంటర్​లో 126 మంది స్లాట్​బుక్ చేసుకోగా111మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు. రసూల్​పురా సెంటర్​లో కేవలం 8 మందే వ్యాక్సిన్ ​వేయించుకున్నారు. సీతాఫల్ మండి , తార్నాక ప్రాంతాల్లో 20 మందికి మించి రాలేదు. శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్​ను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు.

అందులో 30 మంది, శివరాంపల్లి పీహెచ్​సీలో 20 మంది, కాటేదాన్ పీహెచ్​సీలో10 మంది,  నార్సింగిలో 90 మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు. పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన సెంటర్​ను మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ సెంటర్​లో115 మంది టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. కూకట్​పల్లి సర్కిల్ ఎల్లమ్మబండ పీహెచ్​సీలో 30 మంది, శామీర్​పేటలో 35 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అంబర్​పేటలోని తిలక్​నగర్ సెంటర్​లో 15 మందికి వాక్సిన్ వేసినట్లు డాక్టర్​దీప్తి చెప్పారు. శంకర్ పల్లిలో మధ్యాహ్నం వరకు కూడా వాక్సినేషన్ స్టార్ట్ ​కాలేదు. దీంతో టీకాల కోసం వచ్చిన టీనేజర్లు తిరిగెళ్లిపోయారు. షాద్ నగర్​లోని పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లో100 మందికి, షాద్ నగర్ గవర్నమెంట్​ హాస్పిటల్​లో 300 మంది వ్యాక్సిన్ ​తీసుకున్నారని డిప్యూటీ డీఎంహెచ్​వో దామోదర్ తెలిపారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్​లోని సెంటర్​ను ఎమ్మెల్యే కౌసర్ 
మొయినుద్దీన్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం వ్యాక్సిన్ తీసుకునేందుకు 1100 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు డీఎంహెచ్​వో స్వరాజ్య లక్ష్మి తెలిపారు. 

మొదట భయపడ్డా..
నేను బంజారాహిల్స్ గవర్నమెంట్  హై స్కూల్ లో టెన్త్​చదువుతున్నా. మొదట వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడ్డా. కానీ టీచర్లు ధైర్యం చెప్పారు. క్లాస్ టీచర్ హెల్ప్​తో కొవిన్ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకున్నా. - సౌమ్య, టెన్త్​ క్లాస్ ​స్టూడెంట్
వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్
వాక్సిన్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్ట్ చేసినందుకు గవర్నమెంట్​కి థ్యాంక్స్. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. 
- లిఖిత, టెన్త్​ స్టూడెంట్, బంజారాహిల్స్