రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80,138 టెస్టులు నిర్వహించగా.. 2,447 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. గత 24గంటల్లో 2,295మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. వైరస్ కారణంగా ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.31శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు జీహెచ్ఎంసీలో 1112 మందికి కరోనా నిర్థారణ అయింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 235, రంగారెడ్డిలో 183, హనుమకొండలో 80 మంది చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. 

ఇవి కూడా చదవండి..

317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ టీచర్ల ఆందోళన

రంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం