ఇండియా విమెన్స్‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌లో శ్రీజకు ప్లేస్‌‌‌‌

ఇండియా విమెన్స్‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌లో శ్రీజకు ప్లేస్‌‌‌‌

బెంగళూరు: నేషనల్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌, తెలంగాణ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ ఆకుల శ్రీజ ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు ఎంపికైంది. బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌ వేదికగా జులై–ఆగస్టులో జరిగే ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో పోటీ పడే ఇండియా విమెన్స్‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌లో శ్రీజకు ప్లేస్‌‌‌‌ దక్కింది. ఏప్రిల్‌‌‌‌లో జరిగిన నేషనల్‌‌‌‌ టీటీ సింగిల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గిన శ్రీజ తన ర్యాంక్‌‌‌‌ను భారీగా పెంచుకుంది. దీంతో ఊహించినట్టే ఆమెకు అవకాశం లభించింది. శ్రీజ (66వ ర్యాంక్‌‌‌‌)తో పాటు మనికా బత్రా(39), అర్చనా కామత్‌‌‌‌ (66), రీత్‌‌‌‌ రిష్యా (100) ను టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్​ ఇండియా (టీటీఎఫ్‌‌‌‌ఐ) కామన్వెల్త్‌‌‌‌కు  మంగళవారం ఎంపిక చేసింది. దియా చితాలె (129)ను స్టాండ్‌‌‌‌బై ప్లేయర్‌‌‌‌గా ఉంచింది. అయితే, ఇండియా నుంచి రెండో బెస్ట్‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌ అయినప్పటికీ..  సెలక్షన్‌‌‌‌ ప్రమాణాలు అందుకోలేకపోతున్న అర్చనా కామత్‌‌‌‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో  ఈ టీమ్‌‌‌‌కు స్పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా (సాయ్‌‌‌‌) నుంచి క్లియరెన్స్‌‌‌‌ అవసరం అని టీటీఎఫ్‌‌‌‌ఐ తెలిపింది. అదే టైమ్‌‌‌‌లో సీనియర్‌‌‌‌ ప్లేయర్లు ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీలను పట్టించుకోలేదు.