వెటర్నరీ డాక్టర్ హత్యకేసులో ముగ్గురు పోలీసులపై వేటు

వెటర్నరీ డాక్టర్ హత్యకేసులో ముగ్గురు పోలీసులపై వేటు

హైదరాబాద్, వెలుగు: వెటర్నరీ డాక్టర్ మర్డర్ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులను సైబరాబాద్​ కమిషనర్​ సజ్జనార్​ సస్పెండ్​ చేశారు. ఈ నెల 27న మిస్సింగ్​ కేసు నమోదు చేసేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు స్టేషన్​కు రాగా.. ఎఫ్ఐఆర్​నమోదుకు పోలీసులు తీవ్ర కాలయాపన చేశారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సంఘటన స్థలం తమ పరిధి కాదంటే, తమది కాదని ఆర్​జీఐఏ పోలీసులు, శంషాబాద్​ పోలీసులు తిప్పించారని తెలిసింది. దీంతో శంషాబాద్ ఎస్​ఐ రవికుమార్, ఆర్​జీఐఏ హెడ్​కానిస్టేబుల్ వేణుగోపాల్​రెడ్డి, సత్యనారాయణ గౌడ్​లను సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమర్జెన్సీలో పరిధి చూడొద్దు..

అత్యవసర సమయాల్లో వచ్చే కేసులను పోలీస్ స్టేషన్​ పరిధితో సంబంధంలేకుండా కేసులు నమోదు చేసుకోవాలని కమిషనర్​ సజ్జనార్ పోలీసు సిబ్బందికి సూచించారు.