ఎల్ఆర్ఎస్ రిఫండ్లకు కొత్త డిజిటల్ సొల్యూషన్

 ఎల్ఆర్ఎస్ రిఫండ్లకు   కొత్త డిజిటల్ సొల్యూషన్
  • పెండింగ్ చార్జీల చెల్లింపుల కోసం ప్రత్యేక మాడ్యూళ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనధికార, చట్టవిరుద్ధ లేఔట్‌ల రెగ్యులరైజేషన్  ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రెగ్యులరైజేషన్  ఆఫ్  అనప్రూవ్డ్  అండ్  ఇల్లీగల్  లేఔట్  రూల్స్-2020 ప్రకారం రిఫండ్‌లు, పెండింగ్‌లో ఉన్న 14% ఓపెన్  స్పేస్  చార్జీల చెల్లింపుల కోసం ప్రత్యేక డిజిటల్  మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్  అండ్  కంట్రీ ప్లానింగ్  (డీటీసీపీ) కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఈ మాడ్యూళ్లను సెంటర్  ఫర్  గుడ్  గవర్నెన్స్ (సీజీజీ ) సమన్వయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్  శాఖ సెక్రటరీ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రిఫండ్  ప్రక్రియను పారదర్శకంగా, సులభతరంగా మార్చేందుకు ప్రత్యేక డిజిటల్  మాడ్యూల్‌ను రూపొందించనున్నారు.