అభివృద్ధి పైనే మా ధ్యాస : షబ్బీర్ అలీ

అభివృద్ధి పైనే మా ధ్యాస : షబ్బీర్ అలీ
  • పసుపు బోర్డు, అగ్రికల్చర్​ వర్సిటీకి ల్యాండ్​ కేటాయిస్తాం
  • గవర్నమెంట్​ అడ్వైజర్  షబ్బీర్అలీ

నిజామాబాద్, వెలుగు:  పదేండ్లు విధ్వంసక పాలన చేసిన బీఆర్‌‌ఎస్‌తో  ప్రజలు పడ్డ ఇబ్బందులు ఒక్కొక్కటి తొలగిస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం ఆర్​అండ్​బీ  గెస్ట్​హౌజ్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌ , కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డితో కలిసి మీటింగ్​నిర్వహించారు. అనంతరం రాజీవ్​గాంధీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ, 9వ డివిజన్​లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. 

బీఎన్‌ఎల్ గార్డెన్‌లో పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.  మాజీ సీఎం కేసీఆర్​కూతురిగా కవిత కూడా జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని షబ్బీర్​అలీ విమర్శించారు. జిల్లాలో పసుపు బోర్డు ఆఫీస్, అగ్రికల్చర్​ యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన ల్యాండ్​ప్రతిపాదనలు ఆఫీసర్ల నుంచి గవర్నమెంట్​కు అందితే అలాట్​చేయిస్తామన్నారు.  అర్బన్‌లో 1300  మందికి ఇండ్లు మంజూరు చేశామని మరో  2200  మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు.  

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ ఇండ్లు ఇస్తున్నం–   టీపీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​ గౌడ్​

బీఆర్ఎస్​ సర్కార్​ చేసిన రూ.7.50 లక్షల కోట్ల అప్పుల భారంమోస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ ఇతర హామీలు అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్​గౌడ్​తెలిపారు.  బీఆర్‌‌ఎస్ గవర్నమెంట్​చేసిన అప్పులపై నెలకు రూ.6,500  కోట్ల వడ్డీ చెల్లిస్తూ మహిళలకు ఫ్రీ బస్, ఉచిత కరెంట్, రుణమాఫీ, రైతుభరోసా, రాజీవ్​ ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం స్కీమ్​లు అమలు చేస్తున్నామన్నారు. సొంత జాగా ఉన్న ప్రతి అర్హతగల కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోడానికి రూ.5 లక్షలు ఇస్తామని ఎవరూ దళారులను ఆశ్రయించొద్దన్నారు.

గవర్నమెంట్​ ల్యాండ్​ ఫైనల్​ అయ్యాక ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి కేటాయిస్తుందన్నారు.  ఇందుకోసం భూములు పరిశీలిస్తున్నామని తెలిపారు. అర్బన్​ ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, రాకేశ్ రెడ్డి, స్టేట్​మినరల్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, స్టేట్​ కోఆపరేటివ్​డెవలప్మెంట్​లిమిటెడ్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్​అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్​, నగరపాలక కమిషనర్​దిలీప్​కుమార్​ఉన్నారు.