రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పర్యటనలో.. ప్రముఖ కంపెనీలను సందర్శిస్తారు. అమెరికాలో మొదట లాస్ ఏంజిల్స్ నుంచి మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభం కానుంది. 20న శాండియాగో, 21న శాన్ జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్ లో కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో సమావేశం కానున్నారు.
On my way to the United States for a work trip after 5 years. Lots of exciting meetings lined up in west coast and east coast over the course of next week
— KTR (@KTRTRS) March 18, 2022
Looking forward to some hectic activity & travel ?#Wanderlust
తన అమెరికా పర్యటన గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐదేండ్ల తర్వాత ఇవాళ వర్క్ ట్రిప్ కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలిపారు. రానున్న వారమంతా చాలా బిజీగా, తీరిక లేకుండా మీటింగ్స్ కు అటెండ్ కావాల్సి ఉందని పేర్కొన్నారు.