వైద్య సిబ్బంది తీరు మార్చుకోవాలె : ఎర్రోళ్ల శ్రీనివాస్​

వైద్య సిబ్బంది తీరు మార్చుకోవాలె : ఎర్రోళ్ల శ్రీనివాస్​

అచ్చంపేట/కల్వకుర్తి, వెలుగు : అచ్చంపేట సివిల్​హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన సేవలు అందకపోవడంపై తెలంగాణ మెడికల్​సర్వీసెస్​అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​ఎర్రోళ్ల శ్రీనివాస్​ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట సివిల్​హాస్పిటల్ ను విప్​గువ్వల బాల్​రాజ్​తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్​లో మందుల వివరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్​నిర్వహణపై సూపరింటెండెంట్​ప్రభుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్​లో బెడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో సిబ్బందిపై మండిపడ్డారు.  హాస్పిటల్​లో 59 రకాల మందులు ఉండగా కొన్ని మాత్రమే రాయడం ఏమిటని ప్రశ్నించారు. తర్వాత రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళకు కేసీఆర్​కిట్ అందజేశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆయన వెంట డీఎంహెచ్​ఓ సుధాకర్​లాల్, మున్సిపల్​చైర్మన్​నర్సింహాగౌడ్, జడ్పీటీసీ మంత్ర్యానాయక్​, బల్మూర్​ఎంపీపీ అరుణ తదితరులు ఉన్నారు.