
హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గురువారం అందజేసిన ఇండియా మ్యాప్ లో తెలంగాణ లేకపోవడం వివాదాస్పదమవుతోంది. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా నియమితులైన మాధవ్ ఏపీ మంత్రి లోకేష్ను గురువారం అమరావతిలో కలిశారు.
ఈ సందర్భంగా ‘భారత సంస్కృతిక వైభవం’ పేరుతో ఉన్న అఖండ భారత దేశ చిత్రపటాన్ని లోకేష్కు బహూకరించారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇందులో వివిధ దేశాలతో పాటు అన్ని రాష్ట్రాలు విభజించి, పేర్లతో సహా ఉన్నప్పటికీ తెలంగాణ లేకుండా ఉమ్మడి ఏపీని చూపించడంపై విమర్శలు వస్తున్నాయి.