తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. అటు ఏపీలో... ఇటు తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.  గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,932 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, రంగారెడ్డి జిల్లాలో 33, నల్గొండ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. ఇక జోగులాంగ గద్వాల్ జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.

మరోవైపు కరోనా వైరస్ నుంచి 24 గంటల్లో 2,421 మంది కోలుకున్నారు. ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,83,448 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇంకా 11,681 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,107కి పెరిగింది.

ఇవి కూడా చదవండి:

పెళ్లింట విషాదం... పెళ్లికూతురు హఠాన్మరణం