
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ యూటీటీ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకంతో మెరిశాడు. వడోదరలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్1–4 తేడాతో రోనిత్ భంజా (ఆర్ఎస్పీసీ) చేతిలో ఓడి ఈ పతకం అందుకున్నాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్స్లో 3-–1తో వెస్ట్ బెంగాల్కు చెందిన రెండో సీడ్ అంకుర్ను ఓడించాడు.