అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం

అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం

న్యూయార్క్: అమెరికా బోస్టన్‌‌‌‌లోని లోగాన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో బస్సు ఢీ కొని ఓ ఇండియన్~ అమెరికన్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన విశ్వచంద్ కొల్లా(47), తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా పని చేస్తున్నారు. ఆయన మార్చి 28 సాయంత్రం తన స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్టుకు వెళ్లారు. టెర్మినల్ బీ వద్ద వెయిట్ చేస్తుండగా ఓ బస్సు వేగంగా వచ్చి విశ్వచందును ఢీకొట్టింది. 

దాంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బస్సు, డార్ట్‌‌‌‌మౌత్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ మోటార్ కోచ్ కంపెనీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవరయిన 54 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై డార్ట్‌‌‌‌మౌత్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. విశ్వచంద్ మరణం చాలా బాధాకరమని తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీ తెలిపింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసింది.