తెలుగు టైటాన్స్‌‌కు నాలుగో ఓటమి

తెలుగు టైటాన్స్‌‌కు నాలుగో ఓటమి

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌‌ పదో సీజన్‌‌లో తెలుగు టైటాన్స్‌‌ వరుసగా నాలుగోసారి  ఓడింది. బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో తమిళ్‌‌ తలైవాస్‌‌ 38–36తో టైటాన్స్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది. నరేందర్ సింగ్ (10 పాయింట్లు), సామిల్ గులియా (7) తలైవాస్‌‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.

టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్, రిబిన్ చౌదరి ఏడేసి పాయింట్లతో పోరాడారు. మరో మ్యాచ్‌‌లో బెంగళూరు బుల్స్‌‌ 32–30తో జైపూర్ పింక్ పాంథర్స్‌‌పై గెలిచింది.