రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

కామారెడ్డి ​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సూర్యుడు భగభగమంటున్నాడు.  రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు.  శుక్రవారం  రామారెడ్డి మండల కేంద్రంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కాగా.. బిచ్కుందలో 44.7, దోమకొండలో 44.6,  పాతరాజంపేట ( కామారెడ్డి), కొల్లూర్​లో  44.2, డొంగ్లిలో  44,  తాడ్వాయి, ఆర్గొండల్లో 43.9, భిక్కనూరులో 43.8, బీర్కూర్‌‌లో 43.7, వెల్పుగొండ, హాసన్​పల్లిల్లో 43.6, సదాశివనగర్​, పిట్లం, నస్రుల్లాబాద్​ల్లో 43.5,  బీబీపేటలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.