ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి నిలదీత

ఎమ్మెల్యే  ప్రభాకర్రెడ్డి నిలదీత
  • కాంగ్రెస్, బీఆర్ఎస్​ శ్రేణుల మధ్య గొడవ

దుబ్బాక, వెలుగు: సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం మిరుదొడ్డి  మండలం చెప్యాల గ్రామంలో కమటం నరేశ్​ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే  ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా యూరియా కొరత లేకుండా రైతులకు అందించామని, కాంగ్రెస్​ ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని ఆరోపించారు.

 ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న ఎమ్మెల్యేపై అక్కడే ఉన్న కాంగ్రెస్​ కార్యకర్తలు మండిపడ్డారు. పదేళ్లుగా ఎంపీగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశావని ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లిపోయిన తర్వాత బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు.