గూగుల్‌‌‌‌ ప్లేస్టోర్​లో టెర్రర్​ యాప్​!

గూగుల్‌‌‌‌ ప్లేస్టోర్​లో టెర్రర్​ యాప్​!

న్యూఢిల్లీ: టెర్రర్​ లింకులున్న మొబై ల్​ యాప్​ ఒకటి గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులో ఉందని ఢిల్లీకి చెందిన ఇన్నెఫు ల్యాబ్​ ఆందోళన వ్యక్తంచేసింది. ‘అచ్చే బాతే’ పేరుతో ఉన్న ఈ యాప్​ పాకిస్తానీ టెర్రర్​ సంస్థ ‘జైషే మహ్మద్’ అనుబంధమని చెప్పింది. జైషే చీఫ్​ మౌలానా మసూద్​ అజర్ ​రాసిన పుస్తకాలు, ఆడియో సందేశాల లింకులను ఇందులో పొందుపరిచిందని ల్యాబ్ కో ఫౌండర్​ తరుణ్​ విగ్​ చెప్పారు. గత డిసెంబర్​లో లాంచ్​ చేసిన ఈ యాప్​ను 5 వేల మందికి పైగా డౌన్​లోడ్​ చేసుకున్నారని వివరించారు. డౌన్​లోడ్​ చేసుకునే టప్పుడే చాలా విషయాల్లో పర్మిషన్​ అడుగుతుందని, తర్వాత మొబైల్​ ఆన్​లో ఉన్నంతసేపూ బ్యాక్​గ్రౌండ్​లో రన్​ అవుతూనే ఉంటుందని తెలిపారు. లొకేషన్ సహా ఫోన్​లోని వివరాలన్నీ నిర్వాహకులకు చేరవేస్తుందని విగ్​ హెచ్చరించారు.