చరణ్ అన్నా మీ గొంతులో నాన్న వినిపించారు.. తమన్ ఎమోషనల్ పోస్ట్

చరణ్ అన్నా మీ గొంతులో నాన్న వినిపించారు.. తమన్ ఎమోషనల్ పోస్ట్

నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్(Kajal agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా.. లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా నటిస్తోంది. ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట అక్టోబర్ 4న రానుంది. ఈ సందర్బంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఉయ్యాలో.. ఉయ్యాల అంటూ సాగే ఈ పాటను ఎస్పీ బాలసుబ్యమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ పాడినట్టు తెలిపారు తమన్. ఇక పోస్ట్ లో తమన్.. చరణ్ అన్నా మీ గొంతులో నాన్న వినిపించారు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం తమన్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.