రేపు తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్రం మీటింగ్

రేపు తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్రం మీటింగ్

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ఎంతకూ తెగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగుతోంది. వివాదాల పరిష్కారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధమైంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధి అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. రాష్ట్రాలతో చర్చించేందుకు రంగంలోకి దిగింది. నాలుగు కీలకమైన అంశాలపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మీటింగ్ లో చర్చించబోయే అంశాలపై కేంద్ర జలశక్తి మంతిత్వ్ర శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్.. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, సమీర్ శర్మకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తల కోసం: 

ఎలక్షన్ కమిషన్నే రద్దు చేసిన్రు

30 వరకు అయ్యప్ప దర్శనాలు బంద్

పోస్టాఫీసు నుంచి డోర్​స్టెప్​ సర్వీసులు