డిప్యూటీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు సివిల్ సర్జన్లుగా పదోన్నతులు 

డిప్యూటీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు సివిల్ సర్జన్లుగా పదోన్నతులు 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలువురు డిప్యూటీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు సివిల్ సర్జన్లుగా పదోన్నతులు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ జీఓ విడుదల చేసింది. మొత్తం 13 మందికి పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్ గిరి డీఎంహెచ్ఓగా ఉన్న పుట్ల శ్రీనివాస్ ని సివిల్ సర్జన్ గా ప్రమోట్ చేసి.. ఖైరతాబాద్ ప్రాంతానికి బదిలీ చేసింది. 

కూకట్ పల్లి జోన్ కి డాక్టర్ దుర్గా రామ్ కుమార్ ని, చార్మినార్ ప్రాంతానికి బద్దమ్ రాజాశ్రీని డీఎంహెచ్ ఓలుగా నియమించింది. ఇక మంచిర్యాలకు డాక్టర్ సుబ్బారాయుడు, నారాయణ్ పేటకు సౌభాగ్యలక్ష్మి, వనపర్తికి జయ చంద్రమోహన్, జయశంకర్ భూపాలపల్లికి డాక్టర్ మధుసూదన్, మేడ్చల్ మల్కాజ్ గిరికి డాక్టర్ రఘునాథ స్వామి, యాదాద్రి భువనగిరికి పరిపూర్ణాచారి, జనగామకు సాయి శోభాలను డీఎంహెచ్ ఓలుగా నియమించింది. కొత్తగా పదోన్నతులు పొందిన వారు 15 రోజుల్లోపు పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.