పోలీస్​ కమాండ్ ​కంట్రోల్ సెంటర్​​లో  తలుపులు, ఫ్యాన్లు ఎత్తుకుపోయిన్రు!

పోలీస్​ కమాండ్ ​కంట్రోల్ సెంటర్​​లో  తలుపులు, ఫ్యాన్లు ఎత్తుకుపోయిన్రు!
  •     బెల్లంపల్లిలోని బిల్డింగ్​లో చోరీ  
  •     కట్టి నాలుగేండ్లవుతున్నా స్వాధీనం చేసుకోని పోలీస్​ శాఖ

బెల్లంపల్లి, వెలుగు :  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ లో కొత్తగా కట్టిన పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ భవనంలో తలుపులు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్​సామగ్రిని దొంగలు ఎత్తుకుపోయారు. ఈ చోరీ బుధవారం రాత్రి లేదా అంతకుముందే జరిగి ఉంటుందని తెలుస్తోంది. బిల్డింగ్​ కాంట్రాక్టర్ ​బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్​స్పెక్టర్ శంకరయ్య కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

కమాండ్​కంట్రోల్​సెంటర్​లోని 10 టేకు తలుపులు, 14 ఫ్యాన్లు, ఎలక్ట్రికల్, శానిటేషన్ పరికరాలు ఎత్తుకుపోయారని ఆయన కంప్లయింట్​లో పేర్కొన్నారు.  బిల్డింగ్​నిర్మాణం పూర్తయి నాలుగేండ్లవుతున్నా పోలీస్ శాఖ హ్యాండోవర్ చేసుకోకపోవడం దొంగలకు వరంగా మారింది. ఖాళీగా ఉంటుందని గుర్తించి చోరీ చేసినట్టు తెలుస్తోంది.