
- స్థానిక నేతలే ఆక్రమిస్తున్నట్లు ఆరోపణలు!
- టెంట్లు వేసి టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్కు రెంట్
- ఏరియాను బట్టి రూ.5 వేల వరకు వసూళ్లు
- పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులు
మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్లోని ఫుట్పాత్లు కబ్జాకు గురవుతున్నాయి. స్థానిక లీడర్లే వాటిని ఆక్రమిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మీటర్ల చొప్పున షెడ్లు వేసి టిఫిన్సెంటర్లు, టీ స్టాల్స్, ఇతర వ్యాపారాలకు రెంట్కు ఇస్తున్నారు. షాప్ను బట్టి వారి దగ్గరి నుంచి నెలనెలా డబ్బు వసూలు చేస్తున్నారు. ఫుట్పాత్లపై ప్లేస్లేకపోవడంతో జనం రోడ్లపై నడిచి వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్జామ్ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడమే లేదు. అధికారులకు మామూళ్లు అందుతుండటంతో వారు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఎక్కడ చూసినా అదే పరిస్థితి..
ఐటీ కారిడార్లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో సాఫ్ట్ వేర్, ఇతర కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాగా ఈ ప్రాంతాల్లోని రోడ్ల వెంట ఉన్న ఫుట్పాత్లను అక్రమించుకొని షెడ్లు వేసేస్తున్నారు. ఐటీసీ కోహినూర్పక్కనే ఉన్న రోడ్డు నుంచి టీ హబ్వరకు ఉన్న మొత్తం 1.3 కిలోమీటర్ల ఫుట్పాత్ఆక్రమణకు గురయ్యింది. భోజనం కోసం వచ్చే వారి కార్లు, బైక్ లతో రోడ్డు మొత్తం నిండిపోతోంది. ఈ ప్రాంతం మాదాపూర్ట్రాఫిక్పోలీస్స్టేషన్కు సమీపంలోనే ఉన్నా.. పోలీసులు నిత్యం ఈ రూట్లో తిరుగుతున్నా వీటి గురించి పట్టించుకోవడంలేదు. మాదాపూర్అయ్యప్ప సొసైటీ 60 ఫీట్రోడ్ లో టిఫిన్సెంటర్లు, తోపుడు బండ్లు మొత్తం రోడ్డుపైనే పెడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్జామ్ఏర్పడి అఫీస్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు నిమిషాల్లో వెళ్లే మార్గానికి అరగంట టైమ్ పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.
బస్టాప్ రోడ్డును క్లోజ్ చేసి..
మాదాపూర్లోని కరాచీ బేకరీ నుంచి ఆవాస హోటల్ వరకు ఉన్న సర్వీస్రోడ్, బస్టాప్రోడ్ లో ప్రతిరోజు సాయత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఫుడ్ట్రక్కులు, టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. బస్టాప్లైన్లో కూడా పెడుతుండటంతో సాయంత్రం పూట ఆర్టీసీ బస్సులను రోడ్డుపైనే ఆపాల్సి వస్తోంది. దీంతో బస్సు వెనుకాల వెహికల్స్బారులు తీరుతున్నాయి. ఇక్కడికి వచ్చే వారు తమ వెహికల్స్ను మెయిన్ రోడ్ మీదనే పార్క్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
అధికార పార్టీ లీడర్ వసూళ్ల దందా?
కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ టీఆర్ఎస్లీడర్ మాదాపూర్, కొండాపూర్ఏరియాల్లో ఫుట్పాత్ఖాళీగా కనిపిస్తే ముందుగా అక్కడ తానే షెడ్ వేసి ఆ తర్వాత రెంటుకు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్ట్రీట్వెండర్స్ జిల్లా నాయకుడినని చెప్పుకుంటూ అనుచరులతో కలిసి ఫుట్పాత్పై ఉన్న షాప్, ఏరియాను బట్టి నెలకు రూ.500 నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులను తాను మేనేజ్చేస్తానని వారితో చెప్తున్నట్లు సమాచారం. ఈ డబ్బులో కొంత భాగాన్ని అధికారులకు పంపిస్తుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దుకాణాలకు పర్మిషన్ ఇచ్చే స్ట్రీట్టౌన్వెండింగ్ కమిటీ నామ్కే వాస్తేగా పనిచేస్తోందనే విమర్శలు ఉన్నాయి.
నడిచేందుకు దారిలేదు
సైబర్టవర్స్వద్ద ఫుట్పాత్ఆక్రమణకు గురికావడంతో నడిచేందుకు ఇబ్బందిగా మారింది. రోడ్డుపై నుంచి నడవాల్సి వస్తోంది. దీంతో వెహికల్స్ కు ట్రాఫిక్ జామ్ అవుతోంది. కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
- జగదీశ్వర్రెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయ్
ఎప్పటికప్పుడు క్లియర్ చేయిస్తున్నాం..
ఐటీ కారిడార్లో రోడ్లపై పార్కింగ్ చేసే బండ్లను ఎప్పటికప్పుడు ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ వెహికల్స్తో క్లియర్చేయిస్తున్నాం. కొన్ని సమయాల్లో మాత్రమే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉందని మా దృష్టికి తీసుకువస్తే క్లియర్ చేస్తాం.
– శ్రీనివాస్రావు, ట్రాఫిక్ డీసీపీ, సైబరాబాద్